Friday, May 27, 2011

22వ వర్ధంతి; 24వ వర్ధంతి, 25వ వర్ధంతి


22వ  వర్ధంతి:-(6-11-2011)




















































































































































































































































































































































22వ వర్ధంతి; 6-11-2011

















































































రాయవరం మునసబు -
వుండవిల్లి సత్యనారాయణ మూర్తి గారి
24 వ వర్ధంతి


















































































25వ వర్ధంతి 6-11-2014


కడవరకూ కాంగ్రెస్‌వాది - వుండవల్లి సత్యనారాయణ మూర్తి..
 వుండవల్లి సత్యనారాయణ మూర్తి... ఈ పేరు పరిచయమే కాని వెంటనే రూపం స్ఫురణకు రాదు. రాయవరం మునసబుగారంటే (1914-89) - ఈ తరం వారిలో ఏమోకాని నిన్న మొన్నటి తరం వారందరికీ సుపరిచితులు. ఈ సంవత్సరం ఆయన శతజయంతి జరుగుతుంది. ఆయన ఒక మహా చైతన్యమూర్తి ఓ గొప్ప స్ఫూర్తిదాత. ఊహ కందని దార్శనికుడు, ఆయన బహుముఖ ప్రతిభను గుర్తు చేసుకోవడం, ఆయనను ప్రత్యక్షంగా పరోక్షంగా ఎరిగిన ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడతారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో సత్యనారాయణమూర్తి పాల్గొనడంతో సత్యనారాయణమూర్తి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఈయన పదహారణాల కాంగ్రెస్‌వాది. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించడంలో ఆయన విఫలమైనా కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై గౌరవంతో రామచంద్రాపురం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావలసిన సత్యనారాయణమూర్తి బ్యాంకు చైర్మన్‌ పదవితో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌ కోశాధికారిగా కాకినాడలో ఆంధ్ర కాంగ్రెస్‌ సభలు వైభవంగా జరిపించారు. 1967 ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థి వర్గాన్ని ఓటమిపాలు చేసారు. సంగీత వెంకటరెడ్డి విజయం జిల్లాలో కొత్త చైతన్యాన్ని నింపింది. 1981లో రాయవరం సమితి అధ్యక్షులుగా అనపర్తి నియోజకవర్గంలో ప్రముఖనేత మూలారెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. కడవరకు కాంగ్రెస్‌ వాదిగా నిలిచిన ఉన్నతులు. ఎన్టీ రామారావు స్వయంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు. రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుంచి 1989 పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన విజయం చేకూర్చేందుకు కృషి చేస్తూ ద్రాక్షారామం భీమేశ్వర స్వామి సన్నిధిలో తనువు చాలించేవరకూ కాంగ్రెస్‌ వాదిగా నిలిచారు. తొలిదశలో సహకార రంగం సంపన్నుల ప్రాబల్యంలోనే ఉంది. 1953లో రాయవరం ప్రాంతంలో 2,500 ఎకరాలకు రెండో పంటకు అవకాశం కలిగేలా తుల్యభాగ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ పనిచేయడం ప్రారంభించింది. పంజాబ్‌లో భూగర్భ జలాల వినియోగ విధానాన్ని సత్యనారాయణ మూర్తి తమ ప్రాంతంలో అమలు చేసేందుకు కృషి చేశారు. కోపరేటివ్‌ బ్యాంక్‌ చైర్మన్‌గా పనిచేసినప్పుడు (1964) సహకార స్ఫూర్తి సమాజంలో వ్యాపించేలా చేశారు. చేనేత వంటి వివిధ వృత్తుల వారి మొదలు రకరకాల ఉద్యోగులు స్వయంగా కో ఆపరేటివ్‌ సంఘాలు నెలకొల్పేలా ప్రోత్సహించారు. అండగా నిలిచారు. సహకార రంగం ఇంత విస్తృతంగా వృద్ధి చెందడం-ఇతర ప్రాంతాలకు మార్గదర్శకం అయ్యింది. 75 ఏళ్ళ జీవితంలో సత్యనారాయణమూర్తికి తెలిసింది విశ్వాసం మేర ముందుకెళ్లడం, ప్రత్యర్థి గుండెల్లో గుబులు పుట్టేట్లు చేయడం- సాధారణంగా ఈ రెండు ప్రధానాంశాలైతే ఆయనను మనం గుర్తు పెట్టుకొనవలసిన అవసరంలేదు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా, అక్షరాస్యులను ఉన్నత విద్యావంతులుగా చేయడానికి ఆయన విశేష కృషి చేశారు. 1950లో రాయవరంలో 7 ఎకరాల భూరి విరాళం స్వయంగా ప్రకటించి దత్తత తండ్రి పేరున ‘రామయ్య జిల్లా పరిషత్‌ హైస్కూల్‌’ స్థాపించారు. 65 ఏళ్ళ క్రితం పరిసర గ్రామాలు రమారమి 30కి పైగా పెద్ద దూరం వెళ్ళనక్కరలేకుండా తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించారు. తూర్పు గోదావరి జిల్లాలో 1966లో 14 ఎకరాల ప్రాంగణంలో ఉండవల్లి సత్యనారాయణమూర్తి కళాశాలను నెలకొల్పారు. రమారమి వంద గ్రామాల నుంచి, ఇరవై హైస్కూళ్ళ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/టెన్త్‌ తర్వాత కళాశాల విద్యను చేరువలో గ్రహించేలా చేశారు. రామచంద్రాపురం కాలేజీ ప్రజ్ఞామూర్తులకు కేంద్రం, శ్రద్ధగా చదువుకోవాలనేవారికి ప్రముఖ కళాశాల, అత్యంత సమర్థులను అధ్యాపకులుగా ఎంపిక చేసి, కళాశాలే సర్వస్వంగా భావించి వారు కృషి చేశారు. కొన్ని మంచి పనులు, కలకాలం నిలిచే పనులు ఏడుపదుల జీవితకాలంలో ఆయన చేశారు. ఎప్పటికీ రాయవరం మునసబుగారుగా ఆయన ఆ ప్రజల జీవన స్రవంతిలో ఒక భాగంగా నిలుస్తారు. -డాక్టర్‌ బి.వి.వి. బాలకృష్ణ (నేడు సత్యనారాయణ మూర్తి 25వ వర్థంతి)

  A man of magnificent munificence and magnanimity unparalleled Rayavaram Munsif, as he was popularly known is a rare personality. The East Godavari District in general and Ramachandrapuram in particular owes its progress in education to him. But for him hundreds of thousands of engineers,doctors,technocrats, administrators and employees would have been deprived of their livelihood. Salute to the great educationist on his 25th death anniversary.
 -Venkatakrishnaiah Manne

Add caption
బ్లాగ్ నిర్మాణం..నిర్వహణ...
కొత్త కమలాకరం

No comments:

Post a Comment